కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి

Apr 25 2025 8:22 AM | Updated on Apr 25 2025 8:22 AM

కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి

కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలి

గద్వాలటౌన్‌: యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. గురువారం గద్వాల ప్రభుత్వ పీజీ సెంటర్‌లోని కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సమ్మెకు పలు విద్యార్థి సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు అధ్యాపకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21 వల్ల కాంట్రాక్టు, పార్ట్‌ టైం అధ్యాపకుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే రెగ్యులర్‌ చేయాలని, పార్ట్‌ టైం అధ్యాపకులకి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు మంగళగిరి శ్రీనివాసులు, మహేందర్‌, గోపినాథ్‌రాథోడ్‌, వంగూరి గణేష్‌లతో పాటు విద్యార్థి నాయకులు భాస్కర్‌, నవీన్‌కుమార్‌, శ్రీనునాయక్‌, కోటి, బలిచక్రవర్తి, మమత, స్పందన, శ్యామల, నిఖిత, మైథిలి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement