
నాసిరకం మట్టితో రైల్వే స్టేషన్ పనులు
అలంపూర్: జోగుళాంబ రైల్వే స్టేషన్ వద్ద నాసీరకం మట్టితో పనులు చేపడుతున్నారని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అలంపూర్ చౌరస్తా సమీపంలోని జోగుళాంబ రైల్వే స్టేషన్ వద్ద చేపడుతున్న పనులను ఆయనతోపాటు నాయకులు మంగళవారం సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సెంట్రల్ రైల్వే అధికారులు రెండేళ్లుగా పనులు చేపడుతున్నారని, అయితే, అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ట్రాక్ల పక్కన ఎర్రమట్టికి బదులుగా సుద్ద మట్టితో పనులు చేస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలంలో ట్రాక్ పక్కన వేసిన సుద్ద మట్టి జిగురుగా మారి ప్రయాణికులు జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాసీరకం మట్టిని తరలించి పనులు చేపడుతున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని రాజగోపాల్, పిడుగు వెంకటేష్, రాజశేఖర్ శర్మ, నాగేశ్వరరెడ్డి, సుధాకర్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, రవి, సుంకన్న, ఉపేంద్ర తదితరులు ఉన్నారు.