గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు

Sep 17 2025 7:59 AM | Updated on Sep 17 2025 7:59 AM

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలు

భూపాలపల్లి: జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కిరణ్‌ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారం, సాగు విస్తరిస్తున్న పరిస్థితిని పరిగణలోకి తీసుకుని, వాటిని అరికట్టేందుకు సమగ్ర వ్యూహరచనతో చర్యలు ప్రారంభించామన్నారు. ఈ మేరకు జిల్లాలోని ప్రతి సర్కిల్‌ పరిధిలో ఒక్కో ప్రత్యేక బృందాన్ని, భూపాలపల్లి టౌన్‌లో రెండు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు తమ పరిధిలో గంజాయి వినియోగం జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవడం, సాగు జరుగుతున్న పొలాలను వెలికితీయడం, సరఫరా మార్గాలను అడ్డుకోవడం జరుగుతుందన్నారు.

ఎస్పీ కిరణ్‌ ఖరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement