క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలి

Aug 30 2025 7:24 AM | Updated on Aug 30 2025 7:24 AM

క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలి

క్రీడలను భాగస్వామ్యం చేసుకోవాలి

భూపాలపల్లి అర్బన్‌: ప్రతి ఒక్కరూ క్రీడలను జీవితంలో భాగస్వామ్యం చేసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభించాలని ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్‌ చంద్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి వర్క్‌పీపుల్స్‌ గేమ్స్‌ అసోసియేషన్‌ 26వ వార్షిక క్రీడ పోటీలను జీఎం ప్రారంభించారు. ఈ క్రీడపోటీలు మన ఆరోగ్య సాధనలో భాగం కావాలని, సంస్థకు మంచిపేరు తీసుకురావాలని అ న్నారు. సింగరేణి సంస్థ క్రీడల ప్రోత్సాహానికి, యు వ ఉద్యోగులలో ప్రతిభను వెలికితీసి దేశ స్థాయిలో రాణించాలనే ఉద్దేశంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. సింగరేణి సంస్థను మొదటి స్థానంలో ఉండే విధంగా కృషి చేయాలని యువ క్రీడాకారులకు, ఉద్యోగులకు జీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు కవీంద్ర, అధికారులు మారుతి, శ్రావణ్‌కుమార్‌, నజీర్‌, గుర్తింపు, ప్రాతినిథ్య సంఽఘాల నాయకులు రమేష్‌, మధుకర్‌రెడ్డి, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ పాక దేవయ్య, కెప్టెన్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement