బదిలీపై వెళ్తున్న మేనేజర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

బదిలీపై వెళ్తున్న మేనేజర్‌కు సన్మానం

Jul 13 2025 7:36 AM | Updated on Jul 13 2025 7:36 AM

బదిలీపై వెళ్తున్న మేనేజర్‌కు సన్మానం

బదిలీపై వెళ్తున్న మేనేజర్‌కు సన్మానం

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఆరో గని మేనేజర్‌ రామ్‌ భరోస్‌ మెహతో బదిలీపై వెళ్తున్న సందర్భంగా స్థానిక జీఎం కార్యాలయంలో శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా సింగరేణి జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. గనిలో ఉత్పత్తి, ఉత్పాదకతలను మేనేజర్‌ మెరుగు పరిచారని కొనియాడారు. ఉద్యోగులతో సౌమ్యంగా వ్యవహరిస్తూ గనిని అభివృద్ది పథంలో నడిపించడానికి కృషి చేసినట్లు తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కవీంద్ర, అధికారులు ఎర్రన్న, రవికుమార్‌, రవీందర్‌, ప్రసాద్‌, సురేఖ, మారుతి, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement