
కొనుగోళ్లపై రైతుల్లో ఆవేదన
భూపాలపల్లి రూరల్: ధాన్యం కొనుగోళ్లపై రైతుల్లో చాలా ఆవేదన ఉందని, ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని, ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ రైతుల ఇబ్బందులు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. రైతులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. రైతులకు నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
జిల్లాలో 4 సంఘాలు ఎంపిక
‘అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025, రైతు ఉత్పత్తి సంఘాల అభివృద్ధి’ అనే అంశంపై కలెక్టర్ రాహుల్శర్మ అధ్యక్షతన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర హాజరై మాట్లాడారు. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ వ్యవసాయరంగాన్ని సహకార రంగంతో ముడివేసి జాతీయస్థాయిలో సుమారు 10వేల రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు భారత సహకార మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా తెలంగాణలో 311 సంఘాలను ఎంపిక చేశారని.. వాటిలో మన జిల్లాలో నాలుగు సంఘాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్కుమార్, జిల్లా సహకార అధికారి వాల్యానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్, సింగిల్ విండో చైర్మన్లు, కార్యదర్శులు పాల్గొన్నారు.
తప్పు చేస్తే ఉపేక్షించం
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు