
సభను జయప్రదం చేయాలి
టేకుమట్ల: ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన బీఆర్ఎస్ సభను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవిగౌడ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రజలను మోసంచేస్తున్న కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రజలను సిద్ధం చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల ను నిత్యం మోసంచేస్తున్నారన్నారు. ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చలో వరంగల్ కార్యక్రమానికి మండలం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కశ్మీర్ పహల్గాం పర్యాటకుల మృతికి సంతాపంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మా జీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, ఆది రఘు, బందెల నరేష్, ఉమేందర్రావు, వెంకటేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి