కన్న కొడుకును కడతేర్చిన తండ్రి | - | Sakshi
Sakshi News home page

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

Apr 23 2025 7:59 AM | Updated on Apr 23 2025 8:35 AM

కన్న

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

రేగొండ: తలపై రోకలి బండతో కొట్టి కన్న కొడుకును తండ్రి కడతేర్చిన ఘటన మండలంలోని రేపాకపల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రేపాకపల్లి గ్రామానికి చెందిన కాసం మొండయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు ఓదెలు (35) 108 వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఓదెలుకు పరకాల మండలానికి చెందిన దేవితో 14 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన కొన్ని సంవత్సరాల నుంచి కోడలితో మొండయ్య అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఓదెలు పెళ్లి రోజు వేడుకలు చేసుకుంటుండగా తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమనిగింది. ఎలాగైనా కొడుకును అడ్డు తొలగించి కోడలిని దక్కించుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం ఓదెలు తన ఇంటి ఆవరణలో నిద్రిస్తుండగా తలపై రోకలిబండతో కొట్టగా తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితుడు రేగొండ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేష్‌ పరిశీలించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

పెళ్లిరోజు వేడుకల్లో గొడవ

మరుసటి రోజే విషాదం

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి1
1/1

కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement