
గర్భిణులు పోషకాహారం తీసుకోవాలి
చిట్యాల: గర్భిణులు, బాలింతలు సంవృద్ధిగా పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం సూపర్వైజర్ జయప్రద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భం దాల్చిన నుంచి వేయి రోజుల వరకు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తూ ఆరు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ హేమ, ఎంపీడీఓ జయశ్రీ , ఒడితల వైద్యురాలు మౌనిక, ఎస్సై ఈశ్వరయ్య, ఎంఈఓ రఘుపతి మాట్లాడారు. అనంతరం ముగ్గురు గర్భిణులకు సీమంతం, ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన, ఐదుగురు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం మంజుల, సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు, ఆశలు, కార్యదర్శులు పాల్గొన్నారు.