భగవద్గీతను అందరూ చదవాలి
హన్మకొండ కల్చరల్: శ్రీకృష్ణభగవానుడు ఉపదేశించిన భగవద్గీత అందరు చదవాలని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ వరంగల్ అధ్వర్యంలో సోమవారం హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపంలో గీతాజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రోగ్రాం ఇన్చార్జ్ రామిరెడ్డి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గంగు ఉపేంద్రశర్మ, అతిథులుగా ఆర్యవైశ్య సంఘం నాయకులు గట్టు మహేశ్బాబు, వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల కంఠస్థపోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. న్యాయనిర్ణేతలుగా తెన్నేటి వసుంధర, వలస పైడి, మచ్చమ్మ, దయాకర్స్వామి, వేదాంతం శ్రీదేవి, దుర్గ వ్యవహరించారు. కార్యక్రమంలో టీటీడీ మండపం ఇన్చార్జ్ రఘువీర్, వికాస తరంగిణి ఉపాధ్యక్షులు దయాకర్రెడ్డి, కామిశెట్టి రాజు, బన్న శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


