మహాప్రభో! | - | Sakshi
Sakshi News home page

మహాప్రభో!

Jul 29 2025 8:32 AM | Updated on Jul 29 2025 8:32 AM

మహాప్రభో!

మహాప్రభో!

వినతులు కొన్ని ఇలా..

● పాలకుర్తి మండలం మంచుప్పుల గ్రామానికి చెందిన ముదిరాజ్‌ సంఘం నాయకులు గ్రామంలో సొసైటీ చెరువు కబ్జాకు గురైందని, విచారణ చేపట్టి చర్య తీసుకోవాలని విన్నవించారు.

● నర్మెట మండలం బొమ్మకూరు శివారు బోడబండతండాకు చెందిన మూడావత్‌ శ్రీకాంత్‌ అనే వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు.

● జనగామ మండలం పెంబర్తి గ్రామానికి చెందిన బండ సత్తయ్య అనే వ్యక్తికి చెందిన భూమిని బండ నర్సయ్య అనే వ్యక్తి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడని, విచారణ జరిపి చర్య తీసుకోవాలని వినతిపత్రం అందించారు.

● వివిధ గ్రామాలు, తండాల నుంచి జిల్లా కేంద్రానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇ బ్బందులు పడుతున్నారని, అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లవకుమార్‌ విన్నవించారు.

● సర్వే నంబర్‌ 280బీ/1లో 2 ఎకరాల భూమి ఉంది. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న. ఆన్‌లైన్‌లో ఫారెస్ట్‌ భూమి అని చూపిస్తుందని రైతు భరోసా రావడం లేదు. విచారణ చేసి న్యాయం చేయాలని జఫర్‌గఢ్‌ మండలం సాగరంకు చెందిన మహేందర్‌ వినతిపత్రం అందించారు.

● దివ్యాంగులకు ప్రభుత్వం అందించే మూడు చక్రాల వాహనాలకు అర్హులనే ఎంపిక చేయా లని తెలంగాణ దివ్యాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, దామెర రమేశ్‌ తదితరులు కలెక్టర్‌ను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement