శాంతి చర్చలు జరపాలి● | - | Sakshi
Sakshi News home page

శాంతి చర్చలు జరపాలి●

Jun 15 2025 8:13 AM | Updated on Jun 15 2025 8:13 AM

శాంతి చర్చలు జరపాలి●

శాంతి చర్చలు జరపాలి●

ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన

జనగామ రూరల్‌: కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో వెంటనే శాంతిచర్చలు జరపాలని, ఆపరేషన్‌ కగార్‌ను నిలిపేయాలని శనివారం జిల్లా కేంద్రంలో అఖిలపక్షం, వామపక్షాలు, ప్రజా సంఘాల నాయకులు, కవులు, రచయితలు, మేధావుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి కనకారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి రాజారెడ్డిలు మాట్లాడుతూ అటవీ సంపద, ఖనిజాలను కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టే కుట్రలో భాగమే ఆపరేషన్‌ కగార్‌ అన్నారు. తక్షణమే బూటకపు ఎన్‌కౌంటర్లను ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే శాంతిచర్చలు జరపాలని, లేదంటే అఖిల పక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెంచారపు బుచ్చిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్‌, బన్సీ నాయక్‌, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు చెంచారపు కరుణాకర్‌ రెడ్డి, బక్క శ్రీనివాస్‌, జోగు ప్రకాష్‌, న్యాయవాది సాధిక్‌ అలీ, వేముల నర్సింగం, రాపర్తి రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement