● అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కన్నెర్ర ● నేతల ఒత్తిళ్లతో చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు | - | Sakshi
Sakshi News home page

● అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కన్నెర్ర ● నేతల ఒత్తిళ్లతో చర్యలు తీసుకుంటున్న ఉన్నతాధికారులు

Jul 16 2025 4:03 AM | Updated on Jul 16 2025 4:03 AM

● అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కన్నె

● అక్రమ దందాలపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కన్నె

మెట్‌పల్లి: విధి నిర్వహణలో నిజాయితీగా వ్యవహరించే అధికారులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి ఉన్నతాధికారులు అలాంటి వారిని ప్రోత్సహించాలి. కానీ.. కొంతకాలానికే బదిలీ వేటు వేస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. మెట్‌పల్లి ప్రాంతంలో ఇటీవల జరిగిన ఇద్దరి అధికారుల బదిలీ స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఇద్దరు మామూళ్లకు దూరంగా ఉంటూ.. అక్రమదందాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయినప్పటికీ ఇక్కడ బాధ్యతలు చేపట్టిన ఏడాది లోపే వారికి బదిలీని బహుమతిగా ఇచ్చి పంపించారు.

సమర్థవంతమైన విధులు నిర్వర్తించినా..

● గతేడాది జూన్‌లో మెట్‌పల్లి సీఐగా నిరంజన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న సమయంలో ఆయన మామూళ్లకు దూరంగా ఉన్నారు.

● అక్రమ దందాలపై కాస్త కఠినంగానే వ్యవహరించారు. ఇసుక, గంజాయి, రేషన్‌ బియ్యం అక్రమంగా తరలింపు వంటి వాటిపై నిఘా పెట్టి పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేశారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించారు.

● ఆయన సర్వీసులో అప్పటివరకు చూపిన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మెట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఇండియన్‌ పోలీస్‌ మెడల్‌కు ఎంపిక చేసింది.

● వీటన్నింటిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఉన్నపళంగా బదిలీ చేశారు.

ఇసుక దందాపై కన్నెర్రనే కారణమా..?

● మెట్‌పల్లి మండలంలో రీచ్‌ లేకపోవడంతో ఇసుక దందా అంతా అక్రమంగానే సాగుతోంది.

● ప్రభుత్వం అక్రమ రవాణాను అరికట్టాలని ఆదేశాలివ్వడంతో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు.

● కేసులు నమోదు చేయడంతోపాటు పెద్ద ఎత్తున డంప్‌లను స్వాధీనం చేసుకొని వేలం వేశారు.

● తహసీల్దార్‌ తీరుతో అక్రమ దందాకు అవరోధాలు ఏర్పడడంతో సోమవారం అకస్మాత్తుగా కలెక్టరేట్‌కు బదిలీ చేశారు.

ఫలించిన రాజకీయ ఒత్తిళ్లు..

● ఈ ఇద్దరి అధికారులను బదిలీ చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం ఉంది.

● అధికారులు నిజాయితీగా వ్యవహరించడం కొందరి నాయకులకు ఇబ్బందిగా మారడంతో తమ పలుకుబడిని ఉపయోగించి బదిలీ చేయించారనే చర్చ నడుస్తోంది.

● పోస్టింగ్‌, బదిలీలకు రాజకీయ నేతల సిఫార్సులు తప్పనిసరిగా మారడంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement