అర్హులందరికీ సంక్షేమ ఫలాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

Jun 30 2025 4:15 AM | Updated on Jun 30 2025 4:15 AM

అర్హులందరికీ    సంక్షేమ ఫలాలు

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు

వెల్గటూర్‌: ప్రజాప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం ఎండపల్లి మండలకేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఉమ్మడి వెల్గటూర్‌ మండలానికి చెందిన 54 మందికి కల్యాణలక్ష్మి, 92 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ గోపిక, వైస్‌ చైర్మన్‌ తిరుపతి, సీనియర్‌ నాయకులు గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, తహసీల్దార్‌ శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాధితుడికి మంత్రి అడ్లూరి పరామర్శ

కోరుట్ల: 15 రోజుల క్రితం కోరుట్లలో గణపతి విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంటు షాక్‌ తగిలి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్‌రెడ్డి రాజేశ్‌ను ఆదివారం రాత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పరామర్శించారు. విద్యుత్‌ షాక్‌ ప్రమాద బాధితుల వైద్యానికి అవుతున్న ఖర్చులను ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామన్నారు. సీఎంరిలీఫ్‌ ఫండ్‌ లేదా విద్యుత్‌ శాఖ నుంచి ఆ డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట ముదిరాజ్‌ సంఘం నాయకులు ఎడ్ల రమేశ్‌, బహుజన దళిత గాయకులు లింగంపల్లి నరేశ్‌, మోర్తాడ్‌ రాజశేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement