శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు | - | Sakshi
Sakshi News home page

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు

Jun 29 2025 6:56 AM | Updated on Jun 29 2025 6:56 AM

శ్రీమ

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు

ధర్మపురి: ధర్మపురి వద్దగల గోదావరి ఒడ్డునున్న శ్రీమహాలక్ష్మీ ఆలయంలో లోక కల్యాణార్థం చేపుడుతున్న పారాయణం శనివారం రెండోరోజుకు చేరింది. ఆలయ వంశీకులు బాల్‌చందర్‌, గుండయ్య, నరహరి ఆధ్వర్యంలో మహిళలు శ్రీపాద శ్రీవల్లభ, విష్ణు, లలిత సహస్ర పారాయణాలు కొనసాగించారు. ఈనెల 27 నుంచి జులై 17 వరకు పారాయణాలు కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

రచయిత కేవీ.నరేందర్‌కు సన్మానం

జగిత్యాల: ఉద్యోగులకు సేవతోనే గుర్తింపు అని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆనందరావు అన్నారు. ఉద్యోగ విరమణ పొందనున్న ప్రముఖ కథా రచయిత, ఉపాధ్యాయుడు కెవి.నరేందర్‌ను శనివారం సత్కరించారు. కథారచయితగా ఎంతో గుర్తింపు పొందిన నరేందర్‌ ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆయన రచనలను మెచ్చుకుని అవార్డు అందించారని తెలిపారు. ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. కార్యదర్శి అమర్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాల: సెప్టెంబర్‌ 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయస్థాయి అవార్డు కోసం జిల్లాలోని అన్ని కేటగిరిల్లో ఉత్తమ ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము తెలిపారు. జూలై 13 చివరి తేదీ అని, అర్హత గల ఉపాధ్యాయులు NATIONALAWARDSTOTEACHERS.EDUCATION.GOV.IN లో వివరాలను నిర్ణీత నమూనాలో అప్‌లై చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన సెట్‌ను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

మైనర్ల డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌

జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. వారం రోజులుగా అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి వాహనాలు నడిపిన 181 మంది మైనర్లకు జరిమానా విధించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆర్నెళ్లలో మైనర్ల డ్రైవింగ్‌తో ప్రమాదాలు చోటుచేసుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌శాఖ అన్ని చర్యలూ తీసుకుంటోంది.

సాధారణ ప్రసవాలకు మొగ్గు చూపాలి

కోరుట్ల రూరల్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఉంటుందని, అన్ని రకాల సేవలకు సిబ్బంది అందుబాటులో ఉన్నారని మాతాశిశు సంరక్షణ అధికారి డాక్టర్‌ జైపాల్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. సేవలను అడిగి తెలుసుకున్నారు. 102 సేవలు, రూట్‌మ్యాప్‌పై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో సమీక్షించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సునీతరాణి, వైద్యులు విజయలక్ష్మీ, సూపర్‌వైజర్లు ధనుంజయ, రమణ, ఫార్మసీ ఆఫీసర్‌ ఉదయ్‌ ప్రసాద్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో   కొనసాగుతున్న పారాయణాలు1
1/3

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో   కొనసాగుతున్న పారాయణాలు2
2/3

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో   కొనసాగుతున్న పారాయణాలు3
3/3

శ్రీమహాలక్ష్మీ ఆలయంలో కొనసాగుతున్న పారాయణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement