
వరుణ దేవుడా కరుణించు..
సారంగాపూర్లో బావుల్లో నీరు లేక పొక్లెయిన్తో పూడిక తీయిస్తున్న రైతు
వెల్లుల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న రైతులు
జలాభిషేకం చేస్తున్న మహిళలు
ఎండిపోతున్న వరి నార్లు
మెట్పల్లిరూరల్/సారంగాపూర్: వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వాతావరణ శాఖ సూచనలతో పొలాలను దున్నిన రైతులు.. మృగశిర కార్తెలో మోస్తరు వర్షం కురవడంతో ఆనందించారు. తీరా విత్తనాలు వేసుకున్నప్పటి నుంచి వరుణుడు ముఖం చాటేయడంతో మొలకలు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు, మహిళలు ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. వెల్లులలో శనివారం సుమారు 50కి పైగా ఆలయాల్లో జలాభిషేకం చేశారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరు మంగళహారతులతో మేళతాళాల మధ్య గంగజలాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయాల్లో అభిషేకాలు జరిపారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో పంటలను కాపాడుకునేందుకు పొక్లెయిన్ సహాయంతో బావుల్లోని పూడిక తీయిస్తున్నారు.