
‘విద్యార్థి దత్తత’ అభినందనీయం
● 650 మంది పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు
ధర్మపురి: నిరుపేద విద్యార్థుల కోసం చేపట్టిన విద్యార్థి దత్తత కార్యక్రమం అభినందనీయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, విద్యార్థి దత్తత కార్యక్రమం కన్వీనర్, గొల్లపల్లి గణేశ్ ఆధ్వర్యంలో మిత్రబృందం కలిసి శనివారం 650 మందికి స్కూల్ బ్యాగులు అందించారు. కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అంచలంచెలుగా ఎదిగి పేద విద్యార్థులకు సేవలందించడం గొప్ప విషయమన్నారు. ఇప్పటివరకు 3,200 మందికి బ్యాగులు అందించారని పేర్కొన్నారు. కన్వీనర్ గణేశ్ను మంత్రి అభినందించారు. డీఈవో రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి, హెచ్ఎం మహేందర్, నాయకులు ఎస్.దినేష్ తదితరులున్నారు.