కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం

Jun 29 2025 6:56 AM | Updated on Jun 29 2025 6:56 AM

కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం

కష్టపడే కార్యకర్తలకు ప్రాధాన్యం

● నేను ఆ స్థాయి నుంచే వచ్చా.. ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

కోరుట్ల: పార్టీలో పనిచేసే కార్యకర్తకు ప్రాధాన్యం ఉంటుందని, తాను ఆ స్థాయి నుంచి మంత్రివరకు ఎదిగానని ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. కాంగ్రెస్‌ కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆయనను శనివారం సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి, కోరుట్లను రెండుకళ్లలా చూసుకుంటానన్నారు. ఏడాదిన్నర వ్యవధిలో 48 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించేలా చూడాలన్నారు. నర్సింగరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీ సత్తా చాటడానికి కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. సీనియర్‌ నాయకులు జువ్వాడి కృష్ణారావు, అన్నం అనిల్‌, సత్యంరావు, తిరుమల గంగాధర్‌, కొంతం రాజం, పుప్పాల ప్రభాకర్‌, నాగభూషణం పాల్గొన్నారు. అంతకుముందు ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన అలాల వినోద్‌, వెల్లుట్ల సాయికుమార్‌ కుటుంబాలకు మంత్రి ఎమ్మెల్యే సంజయ్‌తో కలిసి రూ.5 లక్షల చొప్పున అందించారు.

ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం

బుగ్గారం: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన 191 మందికి కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి శనివారం ప్రొసీడింగ్‌ పత్రాలు అందించారు. 17 మందికి కల్యాణలక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, తహసీల్దార్‌ మాజిద్‌, ఎంపీడీవో అఫ్జల్‌మియా, స్థానిక అధికారులు పాల్గొన్నారు.

అవినీతిపై విచారణ చేపట్టండి

బుగ్గారం పంచాయతీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. గత సర్పంచ్‌ సస్పెన్షన్‌పై స్టే ఆర్డర్‌ను అమలు చేశారని, లోకాయుక్త ఆర్డర్‌ను ఏడు నెలలు గడుస్తున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కలెక్టర్‌ వ్యక్తిగత విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement