జగన్నాథ్‌పూర్‌లో 20 శాఖల అధికారులు | - | Sakshi
Sakshi News home page

జగన్నాథ్‌పూర్‌లో 20 శాఖల అధికారులు

Jun 29 2025 6:56 AM | Updated on Jun 29 2025 6:56 AM

జగన్న

జగన్నాథ్‌పూర్‌లో 20 శాఖల అధికారులు

రాయికల్‌: మండలంలోని జగన్నాథ్‌పూర్‌లో ఒకేరోజు 20 శాఖల అధికారులు పర్యటించారు. పీఎం ధర్తి జాతీయ ఉత్కర్ష్‌ అభియాన్‌లో భాగంగా జిల్లాస్థాయి అధికారులతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించారు. మీసేవ, ఆధార్‌సేవలు ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, సర్టిఫికెట్లు, పోస్టల్‌ ఇన్సూరెన్స్‌, బ్యాంక్‌ సేవలన్నీ ఒకేచోట ఏర్పాటు చేయడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. అర్హులందరికీ కేంద్ర పథకాలు అందించడంతోపాటు వసతుల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.

ఆలయ భూముల్లో సాగు చేస్తే చర్యలు

కొడిమ్యాల: మండలంలోని నల్లగొండ శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ నాయిని సుప్రియ శనివారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ భూములను ఆక్రమించుకున్న రైతులను పిలిపించి మాట్లాడారు. ఆలయ భూముల్లో సాగుచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఆలయ హద్దులు దాటి సాగుచేయొద్దని సూచించారు. అనంతరం గుట్టపై పార్కింగ్‌ స్థలంలో 200 మొక్కలు నాటారు. కార్యక్రమంలో జగిత్యాల డివిజన్‌ దేవాదాయ శాఖ ఇన్‌చార్జి రాజమౌళి, ఎస్సై సందీప్‌, ఆలయ ఈవో వెంకన్న, మల్లేశం, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

జగన్నాథ్‌పూర్‌లో   20 శాఖల అధికారులు
1
1/1

జగన్నాథ్‌పూర్‌లో 20 శాఖల అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement