
పెంచిన బస్పాస్ చార్జీలు తగ్గించాలి
జగిత్యాలటౌన్: విద్యార్థుల బస్పాస్ చార్జీలను తగ్గించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత డిమాండ్ చేశారు. పెంచిన చార్జీలు తగ్గించాలంటూ ఆర్టీసీ జగిత్యాల డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులతో కలిసి శనివారం ఆందోళన చేశారు. మహాలక్ష్మి పేరిట మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం.. ప్రయాణికుల రద్దీకి సరిపడా బస్సులు నడపకపోవడంతో పురుషులకు సీట్లు దొరికే పరిస్థితి లేదన్నారు. బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ఉచిత ప్రయాణం వృథాగా మారిందన్నారు. పైగా విద్యార్థుల బస్చార్జీలను పెంచడం శోచనీయమన్నారు. అనంతరం డిపో సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత