ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి

Jun 28 2025 5:49 AM | Updated on Jun 28 2025 7:37 AM

ఆయిల్

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి

రాయికల్‌: ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని డీహెచ్‌ఎస్‌వో శ్యామ్‌ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం రాయికల్‌ మండలం వీరాపూర్‌లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న నీలి మహేందర్‌ క్షేత్రాన్ని సందర్శించారు. ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి దిగుమతి ప్రారంభమై 30ఏళ్ల వరకు ఆదాయం ఇస్తుందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారి స్వాతి, రైతులు పాల్గొన్నారు.

పశువైద్య కేంద్రం తనిఖీ

జగిత్యాల: జగిత్యాల మండలం పొలాసలోని పశు ఉప వైద్య కేంద్రాన్ని పశుసంవర్దక శాఖ ఏడీ బోనగిరి నరేశ్‌ శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, బిల్డింగ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట వెటర్నరి లైవ్‌స్టాక్‌ ఆఫీసర్‌ కందుకూరి పూర్ణచందర్‌ ఉన్నారు.

హాస్టల్‌ సందర్శన

పొలాస గ్రామంలోని బీసీ హాస్టల్‌ను ప్రత్యేకాధికారి నరేశ్‌ సందర్శించారు. హాస్టల్‌లో ఎంత మంది ఉంటున్నారు, పిల్లల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి1
1/1

ఆయిల్‌పామ్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement