మెనూ ప్రకారం భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ ప్రకారం భోజనం అందించాలి

Jun 28 2025 5:49 AM | Updated on Jun 28 2025 7:37 AM

మెనూ

మెనూ ప్రకారం భోజనం అందించాలి

కోరుట్ల: విద్యార్థులకు మోనూ ప్రకారం భోజనం అందించాలని, నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్‌ బి.లత అన్నారు. పట్టణంలోని మైనార్టీ వెల్ఫేర్‌ స్కూల్‌ను శుక్రవారం సందర్శించి వసతులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భోజన సామగ్రిని పరిశీలించారు. అదనపు కలెక్టర్‌ వెంట ఆర్డీవో జీవాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణ చైతన్య ఉన్నారు.

భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు

రాయికల్‌: విద్యార్థులకు వడ్డించే భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రాయికల్‌ మండలం అల్లీపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు సరఫరా అయ్యే కూరగాయలు, బియ్యం, స్టాక్‌ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఏ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని అన్నారు. అంతేకాకుండా కేజీబీవీలో ఎంపీడీవో చిరంజీవి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

నాణ్యమైన భోజనం అందించాలి

జగిత్యాల: విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని డీఈవో రాము అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు పాఠశాలలతో పాటు, జగిత్యాలలోని బీసీ కళాశాలలోని హాస్టల్‌ను సందర్శించి సరుకులను పరిశీలించారు. పరిశుభ్రత ఉండాలని, విద్యార్థులకు ఎప్పటికప్పుడే ఆహారం వండి పెట్టాలని, గడువు ముగిసిన సరుకులను వాడకూడదని ఆదేశించారు. అనంతరం కళాశాలలోని స్టోర్‌ రూం, సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

మెనూ ప్రకారం భోజనం  అందించాలి1
1/1

మెనూ ప్రకారం భోజనం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement