
పెట్టుబడికి ఉపయోగం
రైతుభరోసా డబ్బులు ఆపదలో ఆదుకుంటున్నాయి. వానాకాలం సీజన్ ఖర్చులకు ఉపయోగపడతాయి. కూలీలు, రసాయన ఎరువుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన క్రమంలో రైతుభరోసా డబ్బులు ఆదుకుంటున్నాయి. ఇతరులను అప్పు అడిగే ఇబ్బంది తప్పింది.
– గణపతి, దొంతాపూర్, ధర్మపురి(మం)
ఖాతాల్లో జమవుతున్నాయి
అర్హులైన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపించాం. ఈ సీజన్లో 2.48 లక్షల మందికి రూ.251 కోట్ల వర కు రైతుభరోసా అందనుంది. తొలి రోజు జిల్లా రైతులకు రూ.76 కోట్లు జమయ్యాయి. కొత్తగా ప ట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల, బ్యాంకు వివరాలు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపిస్తున్నాం.
– భాస్కర్, జిల్లా వ్యవసాయాధికారి

పెట్టుబడికి ఉపయోగం