నాన్న వెంటే పిల్లలు | - | Sakshi
Sakshi News home page

నాన్న వెంటే పిల్లలు

Jul 1 2025 4:19 AM | Updated on Jul 1 2025 4:19 AM

నాన్న వెంటే పిల్లలు

నాన్న వెంటే పిల్లలు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: తాము పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను తీసుకెళ్తున్నారు ఈ తండ్రులు. వీరిని చూసి గ్రామంలోని తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను సర్కార్‌ బడులకు పంపుతున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సత్యనారాయణ ప్రస్తుతం వేములవాడలోని జెడ్పీ హైస్కూల్‌(బాలికలు)లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా సంక్షోభానికి ముందు కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తూ పిల్లలనూ అక్కడే చదివిపించేవారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడంతో తాను పనిచేస్తున్న స్కూల్‌కే తన పిల్లలను తీసుకెళ్తున్నారు. పెద్ద కూతురు అనన్య ప్రభాస 8వ తరగతి, చిన్నకూతురు ప్రవస్థి 5వ తరగతి చదువుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement