రెండే కోర్సులు.. అనేక సమస్యలు | - | Sakshi
Sakshi News home page

రెండే కోర్సులు.. అనేక సమస్యలు

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

రెండే

రెండే కోర్సులు.. అనేక సమస్యలు

మెట్‌పల్లి: ప్రభుత్వ నిర్లక్ష్యంతో మెట్‌పల్లి ప్రాంతంలో పేద విద్యార్దులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలలో తగిన కోర్సులు లేకపోవడం.. డిగ్రీ పూర్తయిన తర్వాత చదువు కొనసాగించడానికి పీజీ కళాశాల లేకపోవడంతో వందలాది మంది అర్ధాంతరంగా మానుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇంటర్‌ వరకు విద్యను అందించే విషయంలో చూపుతున్న శ్రద్ధ.. ఉన్నత విద్యపై చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి. తద్వారా పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేవలం ఆ రెండు కోర్సులే..

● పట్టణ శివారులోని వెంకట్రావుపేటలో ఉన్న డిగ్రీ కళాశాలలో కేవలం బీకాం (కంప్యూటర్స్‌), బీఏ కోర్సులు మాత్రమే ఉన్నాయి.

● సైన్స్‌, మాథ్స్‌ కోర్సులు అందుబాటులో లేకపోవడం చాలామందిని అసంతృప్తికి గురి చేస్తోంది.

● కళాశాలలో మెట్‌పల్లితోపాటు మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలాల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు.

● వీటిలో మూడు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతోపాటు పలు ప్రైవేట్‌ కళాశాలలు ఉన్నాయి.

● ఏటా వీటిలో నుంచి సుమారు 500 మంది విద్యార్థులు ఇంటర్‌ విద్యను పూర్తి చేస్తున్నారు.

● వీరిలో పేద కుటుంబాల విద్యార్థులకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైన్స్‌, మ్యాథ్స్‌ కోర్సులు లేకపోవడం ఇబ్బందిగా మారింది.

● చాలామంది ఈ కోర్సులు లేకపోవడం వల్ల చదువులను అర్ధాంతరంగా మానేస్తున్నారు.

సౌకర్యాలు అంతంతే..

● ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్న భవనం జూనియర్‌ కళాశాలకు చెందినది.

● కొన్నేళ్ల క్రితమే నిర్మించిన ఈ భవనంలో మౌలిక వసతులు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

● ప్రధానంగా తరగతులు నిర్వహించే గదులకు ప్లాస్టరింగ్‌ చేయకుండానే వదిలేశారు.

● కిటీకీలు ఏర్పాటు చేసినప్పటికీ వాటికి తలుపులు బిగించలేదు.

● వర్షాకాలంలో భవనంపై నీరు నిలిచి గదులు ఉరుస్తున్నాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● చుట్టూ ప్రహరీ లేకపోవడం కూడా ఇబ్బందిగా మారింది.

పీజీ కళాశాల ఊసే లేదు..

● విద్యాపరంగా నియోజకవర్గంలో పీజీ కళాశాల ఏర్పాటు అవసరముంది.

● గతంలో కోరుట్లలో కొన్ని కోర్సులతో పీజీ కళాశాల ఉన్నప్పటికీ కొంతకాలం తర్వాత దానిని తీసివేశారు.

● ప్రస్తుతం ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం డిగ్రీలో పలు కోర్సులను అందుబాటులో ఉంచడంతోపాటు పీజీ కళాశాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మెట్‌పల్లి డిగ్రీ కళాశాల అభివృద్ధిపై నిర్లక్ష్యం

ఇబ్బంది పడుతున్న సిబ్బంది, విద్యార్థులు

రూ.53లక్షలతో ప్రతిపాదనలు పంపాం

కళాశాలలో వివిధ అభివృద్ధి పనుల కోసం రూ. 53లక్షలతో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. కొన్ని సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నిధులు మంజూరైతే అవి పరిష్కారమవుతాయి.

– వెంకన్న, ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్‌

రెండే కోర్సులు.. అనేక సమస్యలు1
1/2

రెండే కోర్సులు.. అనేక సమస్యలు

రెండే కోర్సులు.. అనేక సమస్యలు2
2/2

రెండే కోర్సులు.. అనేక సమస్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement