సమస్యల పరిష్కారానికే ‘రైతు మిత్ర’ | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికే ‘రైతు మిత్ర’

Jun 10 2025 3:22 AM | Updated on Jun 10 2025 3:22 AM

సమస్యల పరిష్కారానికే ‘రైతు మిత్ర’

సమస్యల పరిష్కారానికే ‘రైతు మిత్ర’

జగిత్యాలఅగ్రికల్చర్‌: సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే రైతుమిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలో సోమవారం రైతు మిత్ర కార్యక్రమాన్ని రైతులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో నేరుగా సమావేశమై ఎలాంటి విత్తనాలు వాడాలి..? ఎలాంటి ఎ రువులు ఎంచుకోవాలి..? చీడపీడలకు ఎలాంటి మందులు కొట్టాలి..? అనే దానిపై సమగ్ర స మాచారం తెలుసుకోవచ్చని వివరించారు. ప్రతి సో మవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు జగిత్యాల, ధర్మపురి, మెట్‌పల్లి ఏడీఏ కార్యాలయాల్లో రైతుమిత్ర కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిరుపతి నాయక్‌, పొలాస శాస్త్రవేత్తలు శ్రీనివాస్‌, రజనీకాంత్‌, ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement