‘రోల్లవాగు’ అనుమతికి మరింత సమయం | - | Sakshi
Sakshi News home page

‘రోల్లవాగు’ అనుమతికి మరింత సమయం

Jun 12 2025 7:25 AM | Updated on Jun 12 2025 7:33 AM

సారంగాపూర్‌: రోల్లవాగు ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురువుతున్న అటవీభూములకు అటవీశాఖతోపాటు కేంద్రం పర్యావరణ అనుమతి రావాల్సి ఉందని, ఇందుకు సమయం పడుతుందని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) సువర్ణ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి బీర్‌పూర్‌ శివారులోని ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అటవీశాఖ భూములు 800ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఇంజినీరింగ్‌, అటవీశాఖ అధికారులు వివరించారు. ప్రాజెక్టు సమీపంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కవ్వాల్‌ ఫారెస్ట్‌ అభయారణ్యం ఉందని, ఇందుకు పర్యావరణ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. వారి వెంట చీఫ్‌ కన్జర్వేటర్‌ శర్వానంద్‌, డీఎఫ్‌వో రవిప్రసాద్‌, ఈఈ నారాయణరెడ్డి, డీఈ చక్రూనాయక్‌ తదితరులు ఉన్నారు.

సువర్ణను కలిసిన కలెక్టర్‌

జగిత్యాల: రోల్లవాగు పరిశీలనకు వచ్చిన సువర్ణను జగిత్యాలలోని గెస్ట్‌హౌస్‌లో కలెక్టర్‌ సత్యప్రసాద్‌ కలిశారు. ప్రాజెక్ట్‌ గురించి చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement