ఫిట్‌నెస్‌ లేకుంటే వాహనాలు సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ లేకుంటే వాహనాలు సీజ్‌

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

ఫిట్‌

ఫిట్‌నెస్‌ లేకుంటే వాహనాలు సీజ్‌

జగిత్యాలక్రైం: వాహనాలకు ఫిట్‌నెస్‌ లేకుంటే సీజ్‌ చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి భద్రునాయక్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌, ధర్మపురి రోడ్‌, గొల్లపల్లి రోడ్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. పత్రాలు లేని వాహనాలను సీజ్‌ చేసి కార్యాలయానికి తరలించారు. వాహనదారులు వాహన ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌, పర్మిట్‌ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలన్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలన్నారు. ఎంవీఐ ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రణాళికతో చదివి లక్ష్యం చేరాలి

మెట్‌పల్లి: ప్రణాళిక ప్రకారం చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ అన్నారు. పట్టణంలోని గ్రంథాలయాన్ని గురువారం సందర్శించారు. పోటీ పరీక్షలకు ప్రిపెర్‌ అవుతున్న అభ్యర్థులతో కాసేపు ముచ్చటించారు.అభ్యర్థులు భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉండాలని ఆకాంక్షించారు. గ్రంథాలయంలో సౌకర్యాలపై ఆరా తీశారు. అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

కొండగట్టుకు అంతరాయం లేని విద్యుత్‌

మల్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయానికి విద్యుత్‌ అంతరాయం లేకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశామని సాలియా నాయక్‌ అన్నారు. కొండగట్టు సబ్‌స్టేషన్‌ నుంచి 5ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన గురువారం ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో అధిక లోడ్‌ భారం తగ్గుతుందని, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా అవుతుందని వివరించారు. డీఈఈ రాజిరెడ్డి, రవీందర్‌, ఏడీఈ మహేందర్‌, రాజు, దయానంద్‌, రహీం, విద్యుత్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య

వెల్గటూర్‌: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యాబోధన సాధ్యమని డీఈవో కె.రాము అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి, వెంకటాపూర్‌లో విద్యార్థులు లేక మూతబడిన ప్రాథమిక పాఠశాలలను గురువారం పునఃప్రారంభించారు. వెంకటాపూర్‌లో ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రావు, సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరియల్‌ అధికారులు సత్యనారాయణ, రాజేశ్‌, ఎంఈవో ప్రభాకర్‌, హెచ్‌ఎంలు సందయ్య, అరుణ, సంపత్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఈ–పాస్‌తోనే ఎరువులు విక్రయించాలి

మల్యాల: రైతులకు రసాయన ఎరువులను ఈ–పాస్‌ ద్వారానే విక్రయించాలని జిల్లా వ్యవసాయాధికారి వి.భాస్కర్‌ అన్నారు. గురువారం ఏవో కె.చంద్రదీపక్‌తో కలిసి పలు ఎరువుల దుకాణాలను పరిశీలించారు. డీలర్లు రశీదులు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలతో భూసారం పెరుగుతుందని పేర్కొన్నారు. ముత్యంపేటలో జీలుగ, జనుము సాగు చేసిన రైతుల పొలాలను సందర్శించారు. దున్నేటప్పుడు సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ను ఎకరానికి 50కిలోలు వేయాలని సూచించారు. వారి వెంట ఏఈఓ కారుణ్యకుమార్‌, రైతులు పాల్గొన్నారు.

ఫిట్‌నెస్‌ లేకుంటే   వాహనాలు సీజ్‌1
1/2

ఫిట్‌నెస్‌ లేకుంటే వాహనాలు సీజ్‌

ఫిట్‌నెస్‌ లేకుంటే   వాహనాలు సీజ్‌2
2/2

ఫిట్‌నెస్‌ లేకుంటే వాహనాలు సీజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement