నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ

Jun 14 2025 7:35 AM | Updated on Jun 14 2025 7:35 AM

నాణ్య

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 240 యూనిట్ల టాయిలెట్స్‌, 98 కిచెన్‌షెడ్స్‌ను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మంజూరు చేయగా ఎస్టీయూ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ పాఠశాలల మనుగడ ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులు సైతం బాధ్యతగా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్‌, బైరం హరికిరణ్‌ ఉన్నారు.

యూరియా దొరుకుతుందో.. లేదోనని..

మెట్‌పల్లిరూరల్‌(కోరుట్ల): మెట్‌పల్లి విశాల సహకార సంఘం పరిధిలోని వెల్లుల గ్రామానికి గురువారం ఒక లారీ లోడ్‌ యూరియా, శుక్రవారం ఉదయం రెండు లారీల లోడ్‌ యూరియా వచ్చింది. అయితే వాటిని గోదాంలో భద్రపరుస్తుండగా విషయం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. తమకు యూరియా బస్తాలు అందుతాయో లేదోనని ఆందోళనకు గురై, తమకు యూరియా ఇవ్వాలని సహకార సిబ్బందిని కోరారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకున్న సిబ్బంది క్యూలో ఉండాలని పంపిణీ చేస్తామని సూచించారు. దీంతో రైతులు వెంట తెచ్చుకున్న ఆధార్‌, పాస్‌బుక్‌ జిరాక్స్‌లు వరుసలో ఉంచి యూరియా కోసం వేచి చూశారు. ఇదిలా ఉండగా పలువురు రైతులు బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో యూరియా కొరత ఎన్నడు లేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆరోపించారు. ఈ విషయంపై సహకార సంఘం చైర్మన్‌ కొమిరెడ్డి తిరుపతిరెడ్డిని అడుగగా, యూరియా కొరత అవాస్తవమని చెప్పారు. లారీల్లో వచ్చిన యూరియా బస్తాలను గోదాంలో భద్రపరుస్తుండగా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారని, దీంతో ముందుగానే పంపిణీ చేయాల్సి వచ్చిందన్నారు.

క్షీరాభిషేకం.. పుష్పాలంకరణ

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం పూలతో అలంకరించారు. అర్చకుడు శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు.

‘కొప్పుల ఒక ప్రస్థానం’ పుస్తకావిష్కరణ

జగిత్యాల: మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై రూపొందించిన ‘కొప్పుల ఒక ప్రస్థానం’ పుస్తకాన్ని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక కార్మికుడి ప్రస్థానం నుంచి అనేక పోరాటాలు, విజయాలు, రాజకీయ, సామాజిక అంశాలపై పుస్తకం రూపొందించడం అభినందనీయమన్నారు. మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బాపురెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ1
1/3

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ2
2/3

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ3
3/3

నాణ్యమైన విద్యతోనే ప్రభుత్వ బడుల మనుగడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement