
నేరాల నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలి
● ఎస్పీ అశోక్కుమార్
సారంగాపూర్(జగిత్యాల): నేరాల నియంత్రణే ల క్ష్యంగా పోలీసులు పనిచేయాలని ఎస్పీ అశోక్కుమా ర్ సూచించారు. శుక్రవారం సారంగాపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 1993లో మండలంలోని బట్టపల్లి–నేరెళ్ల గ్రామాల మధ్య జరి గిన నక్సల్స్ మందుపాతరలో ప్రాణాలు కోల్పోయి న కానిస్టేబుల్ రాజయ్య విగ్రహానికి పూలమాల వే సి నివాళి అర్పించారు. అనంతరం పోలీసులతో ని ర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పోలీస్స్టేష న్కు వచ్చే బాధితులకు భరోసా కల్పిస్తూ సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పా త నేరస్తులపై నిఘా పెంచాలని, నేరాలు ఎక్కువ జ రిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. ఆధునిక టెక్నాలజీపై అవగాహన ఉండాలని, గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై దృష్టి పెట్టి గ్రామాలను తరచూ సందర్శించాలని పేర్కొన్నా రు. ఠాణాలోని రికార్డు, రైటర్ రూంలు పరిశీలించి ఎస్సైతో పాటు, సిబ్బంది పనితీరుపై అభినందించారు. ఎస్పీ వెంట డీఎస్పీ రఘుచందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ శ్రీని వాస్, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్సైలు దత్తాద్రి, కుమారస్వామి, సదాకర్, సుధీర్రావు, సిబ్బంది ఉన్నారు.