జీవనోపాధి మెరుగుపరిచేందుకే ‘ఉన్నతి’ | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధి మెరుగుపరిచేందుకే ‘ఉన్నతి’

Jun 14 2025 7:35 AM | Updated on Jun 14 2025 7:35 AM

జీవనోపాధి మెరుగుపరిచేందుకే ‘ఉన్నతి’

జీవనోపాధి మెరుగుపరిచేందుకే ‘ఉన్నతి’

మెట్‌పల్లిరూరల్‌(కోరుట్ల): ఉపాధి కూలీల కుటుంబాల్లో జీవనోపాధి మెరుగుపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ఉన్నతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని డీఆర్డీవో పీడీ రఘువరన్‌ అన్నారు. మెట్‌పల్లి పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఉపాధి కూలీలతో సమావేశం నిర్వహించారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ఈటీఐ కరీంనగర్‌ ఆధ్వర్యంలో ఉపాధి కోసం చిరుధాన్యాలతో ఆహారపదార్థాల తయారీ శిక్షణ పూర్తిచేసుకున్న మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌ మండలాలకు చెందిన 35 మంది కూలీలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శిక్షణ సమయంలో వీరికి ఉచితంగా వసతి, భోజన సౌకర్యం కల్పిస్తూ పారితోషికం అందజేసినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో మహేశ్వర్‌రెడ్డి, జేడీఎం ఈజీఎం విజయభారతి, ఏపీవో కొమురయ్య, ఏపీఎం విమోచన, ఎస్‌బీఐ ఆర్‌ఎస్‌ ఈటీఐ శిక్షకురాలు స్వప్న, ఈజీఎం సిబ్బంది అపర్ణ, భూమేశ్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement