
నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలి
● ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల: నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 9వ వార్డులో రూ.11 లక్షలతో నిర్మించే డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హనుమాన్వాడ, పోచమ్మవాడ, శంకులపల్లిలో నీటి కొరత లేకుండా ట్యాంక్ నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. ఇటీవల రూ.50 కోట్లు మంజూరు కాగా, ఏయే పనులు కేటాయించాలో జీవోలో సైతం ఇవ్వడం జరిగిందని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ చైర్పర్సన్ జ్యోతి, గిరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఆహ్వానం
జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే క్రీడా పోటీల ప్రారంభానికి హాజరుకావాలని ఎమ్మెల్యే సంజయ్కుమార్కు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే పెద్దమ్మతల్లి బోనాల జాతర సందర్భంగా వీధిదీపాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ముదిరాజ్ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. వెంటనే కమిషనర్తో మాట్లాడి పనులు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ పంబాల రాము, అధ్యక్షుడు నీలం పెద్దులు, ఉపాధ్యక్షుడు రాజేశ్, ప్రధాన కార్యదర్శి కట్ట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.