ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’ | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’

Jun 13 2025 5:27 AM | Updated on Jun 13 2025 5:27 AM

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’

ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ‘తుమ్మల’

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ల ఇన్‌చార్జీ బాధ్యతల్లో ఎలాంటి మార్పు జరగలేదు. రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా శ్రీధర్‌బాబు, హైదరాబాద్‌ జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్‌లను కొనసాగించారు. ఇటీవల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను నల్గొండ ఉమ్మడి జిల్లా మంత్రిగా నియమించారు.

‘అడ్లూరి’కి నల్గొండ జిల్లా బాధ్యతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement