
60 ఏళ్లుగా విద్యనందిస్తున్న పాఠశాల
● ఎంతో మందిని తీర్చిదిద్దిన పాఠశాల
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ తర్వాత అంతటి పేరుగాంచింది న్యూ హైస్కూల్. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వ పాఠశాలలో చాలామంది ప్రముఖులు చదువుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్, ప్రముఖ వ్యాపారవేత్త మంచాల కృష్ణ, హైకోర్టు జడ్జి సంతోష్రెడ్డి, అమూల్ డైయిరీ రాంమోహన్రావు.. ఇలా చాలామంది ఈ పాఠశాలలో చదువుకున్న వారే. జిల్లా కేంద్రంలోని తీన్ఖని ప్రాంతంలో ఉన్న ఈ హైస్కూల్లో ప్రస్తుతం 300కు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల అదనపు తరగతి గదులు కూడా నిర్మించారు.