
నాన్నతో వెళ్లేవాడిని
– మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల
నా చదువంతా గంగాధరలోసాగింది. స్కూల్కు నాన్న మల్లయ్యనే తీసుకెళ్లేవారు. ఆనందంగా ఉండేది. ఆ ఉత్సాహం వేరేగా ఉంటుంది. ఉపాధ్యాయులు ఎంతో ప్రేమగా చదువు చెప్పేవారు. నాన్ననే రోజూ తీసుకెళ్లేవారు. ఉపాధ్యాయుల చొరవతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోంది. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్స్, ల్యాబ్స్ ఎన్నో వచ్చాయి. ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి. చదువుతోనే భవిష్యత్.