
ప్రభుత్వ పాఠశాలలోనే చదువు
–సంజయ్కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
జగిత్యాలలోని వీక్లీబజార్లోని ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా పాఠాలు చెప్పేవారు. ఆ అనుభూతి వేరు. ప్రతిఒక్కరూ క్రమశిక్షణతో ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చు. స్కూల్లో స్నేహితులతో కలిసి అనేక క్రీడలు ఆడేవాడిని. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. డాక్టర్ అయ్యాను. ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేగా గెలుపొందాను. ఈ తరం విద్యార్థులు కూడా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి.