
ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలి
రాయికల్: ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని రాష్ట్ర తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మాట్లాడుతూ, ఆదివాసీల పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, విద్య, వైద్య సౌకర్యాలను కల్పించాలని, ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలని కోరారు. దీంతో గిరిజనులకు, ఎస్టీలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆయన వెంట నాయకులు ఆత్రం రవీందర్, పరంచ శంకర్ ఉన్నారు.
సేంద్రియ ఎరువులతో భూసారం పెంపు
సారంగాపూర్: సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని పొలాస పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి. రవి, ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ కె. స్వాతి అన్నారు. శుక్రవారం మండలంలోని పెంబట్ల గ్రామంలో రైతుముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులతోపాటు, పురుగు మందులు వాడడం పూర్తిగా తగ్గి స్తేనే నేలతో పాటు, పర్యావరణం కాపాడుకోని పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి ప్రదీప్ రెడ్డి, ఏఈవో అంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

ఒడ్డెలింగాపూర్ను ఐటీడీఏ పరిధిలోకి చేర్చాలి