
సేవ.. స్వచ్ఛంద తోవ
● రాజన్న సేవలో మహిళలు ● ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరు
● గోశాలలోని గడ్డి ఆరబెట్టేందుకు తరలివచ్చిన అతివలు
వేములవాడ: రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు రాజన్న సేవలో తరిస్తున్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వివిధ పనులకు స్వచ్ఛందంగా హాజరవుతున్నారు. హుండీ లెక్కింపు.. ఉత్సవాల సమయాల్లో ఆలయంలో వివిధ సేవల్లో రాజరాజేశ్వరీ సేవా సమితి సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన తిప్పాపూర్ గోశాలలోని గడ్డిని ఆరబెట్టేందుకు సైతం శుక్రవారం భారీగా మహిళలు స్వచ్ఛందంగా వచ్చారు. పశువులకు సేవా చేయడంలో ఉన్న సంతృప్తి వేరేదాంట్లో రాదని వారు పేర్కొంటున్నారు. దాదాపు 63 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కోడెలకు ఉపయోగపడే గడ్డిని ఆరబెట్టే పనుల్లో నిమగ్నమై.. ఆదర్శంగా నిలిచారు.