వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం | - | Sakshi
Sakshi News home page

వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం

May 31 2025 1:14 AM | Updated on May 31 2025 1:14 AM

వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం

వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతం

కొత్తపల్లి(కరీంనగర్‌): టీపీఎన్‌పీడీసీఎల్‌ కరీంనగర్‌ సర్కిల్‌ పరిధిలో విద్యుత్‌ వేసవి కార్యాచరణ ప్రణాళిక విజయవంతమైందని ఎస్‌ఈ మేక రమేశ్‌బాబు అన్నారు. విద్యుత్‌ భవన్‌లోని ఎస్‌ఈ చాంబర్‌లో శుక్రవారం ఉద్యోగులు, సిబ్బందిని అభినందించారు. గత సంవత్సరం నవంబర్‌ నెల నుంచి వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని.. అందుకనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించామన్నారు. లోడ్‌ పెరిగే అవకాశమున్నచోట్ల రాచర్ల తిమ్మాపూర్‌, మొయినకుంట, జేపీనగర్‌, బోనాల, మల్లారం, రేణిగుంట ప్రాంతాల్లో 5 ఎంవీఏ, కరీంనగర్‌ టౌన్‌ బ్యాంక్‌ కాలనీలో 12.5 ఎంవీఏ కొత్త పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు నెలకొల్పామని, కరీంనగర్‌ టౌన్‌ ఉజ్వల పార్క్‌, వాటర్‌ వర్క్స్‌, ఎస్‌ఆర్‌ఆర్‌, నవపేట్‌, వీర్నపల్లి ప్రాంతాల్లో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏ, సప్తగిరికాలనీ సాయినగర్‌(ఖాజీపూర్‌–2)లో 8 ఎంవీఏ నుంచి 12.5 ఎంవీఏ, కోర్కల్‌, వట్టములలో 3.15 నుంచి 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం వరకు పెంచామని వివరించారు. కరీంనగర్‌ మున్సిపల్‌ టౌన్‌, కాజిపూర్‌(బాబుపేట్‌), చిగురుమామిడి, సిరిసిల్ల జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి లోడ్‌ సామర్థ్యం పెంచడంతో విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నివారించగలిగామని చెప్పారు. ఇప్పటివరకు 325 కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుతోపాటు 355 ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌ మున్సిపల్‌ టౌన్‌, కరీంనగర్‌ గ్రామీణ ప్రాంతాల్లో అల్గునూరు, చిగురుమామిడి, హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర ప్రాంతాల్లో ఓవర్‌ లోడ్‌ తగ్గించామని, గత నవంబర్‌ నెల నుంచి నిరంతరాయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటూ వేసవికాల ముందస్తు కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement