
నీటి సంపులో పడి చిన్నారి మృతి
మానకొండూర్: మండలంలోని నిజాయతీగూడెం గ్రామానికి చెందిన తుమ్మనపల్లి శ్రీహర్షిక(3) గురువారం ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. తుమ్మనపల్లి ప్రసాద్ కుమార్తె శ్రీహర్షిక ఇంటినుంచి ఆడుకుంటూ వెళ్లి కచ్చకాయల రామయ్య ఇంటి సమీపంలోని నీటి సంపులో ప్రమాదవశాత్తు పడిపోయింది. శబ్దం వినబడటంతో రామయ్య ఇంటి నుంచి బయటకు వచ్చి బాలికను చూసి కేకలు వేశాడు. కొందరు సంపులోకి బాలికను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సంజీవ్ వివరించారు.