
కొనుగోలు కేంద్రాల తనిఖీ
● కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్
మేడిపల్లి: మండలంలోని వల్లంపల్లి, దమ్మన్నపేట, భీమారం, వెంకట్రావుపేట గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు. సెంటర్లలో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్డీవో జివాకర్రెడ్డి, డీఆర్డీవో రఘువరణ్, డీసీవో మనోజ్కుమార్, తహసీల్దార్లు వసంత, కిరణ్కుమార్, అధికారులు పాల్గొన్నారు. కొండాపూర్లో స్కూల్ యూనిఫాం తయారీని డీఆర్డివో రఘువరణ్ పరిశీలించారు.
రైతులకు ఇబ్బంది రానీయొద్దు
కోరుట్ల రూరల్: ధాన్యం కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రానీయొద్దని కలెక్టర్ అన్నారు. యెఖీన్పూర్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.