
నేడు ప్రజావాణి రద్దు
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నామని ప్రజలు గమనించాలని సూచించారు.
జగిత్యాల సమగ్రాభివృద్ధే లక్ష్యం
● ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాలటౌన్: జగిత్యాల పట్టణ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని, సీఎం రేవంత్రెడ్డి సహకారంతో పట్టణాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే డా.సంజయ్కుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 29వ వార్డులో ఈద్గా ప్రాంతంలో రూ.15లక్షలలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పట్టణంలో రహదారులు, పార్కులు, మార్కెట్లు, ఓపెన్ జిమ్లు, డివైడర్లు, విద్య, వైద్యం విషయంలో జగిత్యాలను అగ్రస్థానంలో నిలబెట్టానని వివరించారు. గాంధీనగర్ నుంచి చల్గల్ వరకు రూ.18కోట్లతో బ్లాక్ స్వాట్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందన్నారు. 29వ వార్డులో దా దాపు రూ. కోటి 50లక్షలతో పనులు చేశామని తెలిపారు. 1కిమీ వరకు పనులు చేపట్టామని, త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధుల మంజూరు కోసం కేంద్ర మంత్రులను కలవనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకేనని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బల్దియా కమిషనర్ స్పందన, డిఈ వరుణ్, ఏఈ శరణ్, మాజీ కౌన్సిలర్ తోట మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడిలోనే చేర్పిస్తాం
కథలాపూర్(వేములవాడ): తమ ఊరి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తామని కథలాపూర్ మండలం చింతకుంట గ్రామస్తులు ఆదివారం తీర్మానించారు. గ్రామంలోని నాయకులు, మహిళా సంఘాల సభ్యులు పాఠశాల ఆవరణలో సమావేశమయ్యారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులు కోరారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందించేందుకు అన్ని వసతులు సమకూర్చుతామని మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హామీ ఇచ్చారు. దీంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామంటూ నాయకులు, మహిళలు తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, ఉమ్మడి కరీంనగర్ డీసీసీ మాజీ కార్యదర్శి చెదలు సత్యనారాయణ, హెచ్ఎంలు రవి, సుధాకర్, నాయకులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి రద్దు

నేడు ప్రజావాణి రద్దు