వరద కాలువ కోసం భిక్షాటన | - | Sakshi
Sakshi News home page

వరద కాలువ కోసం భిక్షాటన

Jun 22 2023 12:32 AM | Updated on Jun 22 2023 12:25 PM

పట్టణంలో భిక్షాటన చేస్తున్న నాయకులు, కార్యకర్తలు - Sakshi

పట్టణంలో భిక్షాటన చేస్తున్న నాయకులు, కార్యకర్తలు

కోరుట్ల: పట్టణంలోని మద్దులచెరువును అనుసంధానిస్తూ వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీజేపీ నాయకులు బుధవారం పట్టణంలో భిక్షాటన చేశారు. వర్షాకాలంలో చెరువునిండి ఆ వరద నీటితో 10, పదకొండో వార్డులు ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. తక్షణమే వరద కాలువ నిర్మాణం చేపట్టాలని కోరుతూ 11వ వార్డు కౌన్సిలర్‌ దాసరి సునీత, పదో వార్డు బీజేపీ ఇన్‌చార్జి దాసరి శేఖర్‌ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ పట్టించుకోవటం లేదని, అందుకే భిక్షాటనతో నిధులు సేకరిస్తున్నామని వారు తెలిపారు. మరికొన్ని నిధులు మున్సిపల్‌ కౌన్సిల్‌ విడుదల చేసి చెరువు నీళ్ల కోసం వరద కాలువ నిర్మించాలని వారు కోరారు. ఈ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్‌లు మాడవేని నరేశ్‌, పెండెం గణేశ్‌, నాయకులు బల్మూరి మురళి, ఇందూరి తిరుమల, పోతుగంటి శ్రీనివాస్‌గౌడ్‌, గిన్నెల అశోక్‌, బింగి వెంకటేశ్‌, వాసాల నవీన్‌, వినయ్‌ కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement