ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీస్‌ల పొడిగింపు

Jul 17 2026 12:52 AM | Updated on Jul 17 2026 12:52 AM

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ మీదుగా చర్లపల్లి –దానాపూర్‌–చర్లపల్లి మధ్య ప్రయాణించే పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీస్‌లను మరికొన్ని రోజులపాటు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ గురువారం తెలిపారు.

పొడిగింపు రైళ్ల వివరాలు..

ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్‌ 26వ తేదీ వరకు 9 సర్వీస్‌లతో చర్లపల్లి–దానాపూర్‌ (07091) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు ప్రతీ సోమవారం 15:00 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్‌ 28వ తేదీ వరకు 9 సర్వీస్‌లతో దానాపూర్‌–చర్లపల్లి (07092) ఎక్స్‌ప్రెస్‌ ప్రతీ మంగళవారం 8:00 గంటలకు కాజీపేట జంక్షన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు కాజీపేట, రామగుండం, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, బల్లార్షా, చాందాపోర్టు, గోండియా, బాల్‌ఘట్‌, నైన్‌పూర్‌, జబల్‌పూర్‌, కఠ్నీ, సంత, మాణిక్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, చౌకీ, పండిట్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జంక్షన్‌, బాక్సర్‌, ఆరా స్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement