విద్యారణ్యపురి : ప్రస్తుతం యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరమని దేశాధినేతలు సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ వల్లంపట్ల నాగేశ్వర్రావు పేర్కొన్నారు. ప్రపంచంలో తలెత్తిన యుద్ధ వాతావరణం దాని ప్రభావాలపై అవగాహన కల్పిస్తూ జనవిజ్ఞాన వేదిక హనుమకొండలో ఆదివారం నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘యుద్ధం కాదు.. ప్రపంచ శాంతి అవసరం’ అనే అంశంపై ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర పర్యావరణ ఉపసమితి కన్వీనర్ కేబీ ధర్మప్రకాశ్ మాట్లాడుతూ.. యుద్ధాలు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బ తీస్తున్నాయని వివరించారు. సమావేశంలో జేవీవీ అధ్యక్షుడు పురుషో త్తం, ప్రధాన కార్యదర్శి భిక్షపతి, సుమలత, వంద న, రేవతి, రాజ్కుమార్, శ్రావణ్కుమార్, శ్రీని వాస్, వెంకటస్వామి, అజయ్, నరేశ్ పాల్గొన్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లంపట్ల నాగేశ్వర్రావు


