మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో ఉచిత వైద్యశిబిరం | - | Sakshi
Sakshi News home page

మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో ఉచిత వైద్యశిబిరం

Oct 11 2025 9:30 AM | Updated on Oct 11 2025 9:30 AM

మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో ఉచిత వైద్యశిబిరం

మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో ఉచిత వైద్యశిబిరం

మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీలో ఉచిత వైద్యశిబిరం

వరంగల్‌: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం (వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే)ను పురస్కరించుకుని వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్‌ అధ్యక్షతన కాశిబుగ్గలోని ‘మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీ’లోని మేధో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి.నిర్మలా గీతాంబ హాజరై, మాట్లాడుతూ.. ‘మానసిక ది వ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్‌లో వీరికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలకు తమను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. అనంతరం మేధో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లు అందించి, వారితో సరదాగా గడిపారు. డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ శ్రీనివాసరావు, ఇంతేజార్‌గంజ్‌ ఎస్‌ఐలు తేజ, వెంకటేశ్వర్లు, డాక్టర్‌ క్యూరీ, డాక్టర్‌ అనూహ్య, సిస్టర్‌ సవీన మరియా, సిస్టర్‌ అంజలిక మరియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement