
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివి జన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్ లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ రంజిత పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ