
పోలీస్ కుటుంబాలకు భద్రత చెక్కుల అందజేత
వరంగల్ క్రైం : కమిషనరేట్ పరిధిలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ పలు కారణాలతో గతేడాది మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు భద్రత విభాగం మంజూరు చేసిన చెక్కులను శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అందజేశారు. కానిస్టేబుల్ నర్సింహస్వామి కుటుంబానికి రూ.7,36,830, మరో కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కుటుంబానికి రూ.5.87 లక్షల విలువైన చెక్కులను సీపీ అందజేశారు. వారి కుటుంబ స్థితిగతులను సీపీ ఆరా తీశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, ఏఓ రామకృష్ణ స్వామి, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు.
ముగిసిన
బాల్బ్యాడ్మింటన్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: ఉమ్మడి వరంగల్ జిల్లా బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని బ్యాడ్మింటన్ మైదానంలో క్రీడా పోటీలు అట్టహాసంగా కొనసాగాయి. గురువారం ఉద యం ప్రారంభమైన పోటీలు రాత్రి ఫ్లడ్లైట్ల వె లుతురులో ముగిశాయి. ముగింపు వేడుకలకు వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య హాజరై కాసేపు బ్యాడ్మింటన్ ఆడి సందడి చేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్ఖాన్, బ్యాడ్మింటన్ సంఘం ఉమ్మడి జిల్లా కార్యదర్శి వీరన్న, బాధ్యులు పాల్గొన్నారు.
క్రీడా శిబిరాలకు
అనూహ్య స్పందన
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమైన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అనూహ్య స్పందన లభించినట్లు డీవైఎస్ఓ గుగులోత్ అశోక్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం శిక్షణ శిబిరాలను సందర్శించిన ఆయన క్రీడాకారులతో మాట్లాడుతూ సెలవుల్లో సమయపాలనతో శిక్షణకు హాజరవ్వాలన్నారు.
5 నుంచి సెలవుల్లో
అదనపు కలెక్టర్
హన్మకొండ అర్బన్ : వ్యక్తిగత కారణాలపై విదేశాలకు వెళ్తున్న క్రమంలో ఈనెల 5వ తేదీ నుంచి హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి సెలవుల్లో ఉండనున్నారు. ఈ మేరకు నెల రోజులు సెలవులు కోరుతూ ఆయన లేఖ రాయగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి. దీంతో నెల రోజులు శ్రీనివాస్ అదనపు కలెక్టర్గా వ్యవహరించనున్నారు.

పోలీస్ కుటుంబాలకు భద్రత చెక్కుల అందజేత