
వైద్యసేవలు మరింత సులభం
కాజీపేట రూరల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్ టెల్ కార్పొరేషన్ రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్, సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం మొబైల్ యాప్స్ అప్లికేషన్ డిజిటల్ సేవలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్, 12 లక్షల మంది రైల్వే సర్వీస్లోని ఎంప్లాయీస్ కోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్), హాస్పిటల్ రిసోర్స్మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)ను దేశవ్యాప్తంగా 714 ఆస్పత్రులు/హెల్త్ యూనిట్ల అనుసంధానంతో పాటు, మొబైల్ యాప్స్తో డిజిటల్ సేవలు అమలు చేయనున్నారు. హెచ్ఎంఐఎస్ను 2019లో, హెచ్ఆర్ఎంఎస్ను 2020లో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉమిత్కార్డు (యూనిక్ మెడికల్ ఐడీకార్డు)తో ఇండియన్ రైల్వేలో రూ.60 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో 26 వేల మంది పెన్షనర్స్ మెడికల్ సేవలు పొందుతున్నారు. హెచ్ఎంఐఎస్ యాప్లో రైల్వే పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం, రెఫరల్ ఆస్పత్రి ఆస్పత్రుల వివరాలు, మందులు అందుబాటులో ఉంటాయి. హెచ్ఆర్ఎంఎస్ యాప్లో రైల్వే ఎంప్లాయిస్ లీవ్స్, పీఎఫ్, సాలరీ, ఎస్ఆర్, ఈ–పాస్లు (పెన్షనర్స్ కోసం–సంవత్సరానికి రెండు ఉచిత ట్రైన్ పాస్ ఉంటుంది) హెచ్ఎంఐఎస్, హెచ్ఆర్ఎంఎస్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలోకి వెళ్లి డిజిటల్ సేవలు పొందాలి.
డిజిటల్ సేవలు ఉపయోగకరం..
రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే పెన్షనర్స్, రైల్వే ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు డిజిటల్ సేవలు ఎంతో ఉపయోగం. రైల్వే పెన్షనర్స్ యాప్ తెలియకుంటే ఇంట్లో పిల్లలతో, లేదంటే తెలిసిన వారితో సేవలు పొందాలి. దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లు, 70 రైల్వే డివిజన్లలో ఈ డిజిటల్ సేవలపై రైల్వే శాఖ అధికారుల సహకారంతో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ (ఎఐఆర్ఆర్ఎఫ్)తో వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం.
– ఎస్.శ్రీధర్,
ఏఐఆర్ఆర్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్
పెన్షనర్లు, ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక యాప్లు
ప్రారంభించిన రైల్వే మంత్రిత్వ శాఖ

వైద్యసేవలు మరింత సులభం