
అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీగా రాయల ప్రభాకర్రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రావును వరంగల్ పోలీస్ కమిషనరరేట్ అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభాకర్రావు వరంగల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేశారు. ఈమేరకు కమిషనర్ సన్ప్రీత్సింగ్ను ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.
రికార్డు స్థాయిలో ధాన్యం
కొనుగోలు : కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో 157 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 1,16,290.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇది గతేడాది రబీ సీజన్తో పోలిస్తే 40,330.240 మెట్రిక్ టన్నులు అధికమని పేర్కొన్నారు. ఽ24,814 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 252.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన 53 రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరిగతిన కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు.
యువత మత్తు
వలలో పడొద్దు
హన్మకొండ అర్బన్: యువత వారి భవిష్యత్, దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మత్తు మహమ్మారి వలలో పడొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న మాదకద్రవ్యాలు, గుట్కా వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ వైవీ గణేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ , గుట్కా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ చేపట్టనున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు.
ఆదాయం పెంచాలి..
ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్
హన్మకొండ: డిపో ఆదాయాన్ని పెంచాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1, హనుమకొండ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాల్ని పరిశీలించారు. వరంగల్–1 డిపోలో మొక్క నాటారు. ఈసందర్భంగా కార్మికులను ఉద్దేశించి సోలమన్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వివిధ హోదాలో ఉన్న 20 మందితో ఒక టీమ్ ఏర్పాటు చేసి డిపో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు

అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు